మోదీ చేతిలో బందీ అయిన భరతమాతను విడిపించాలి : మక్కన్ సింగ్

మోదీ చేతిలో బందీ అయిన భరతమాతను విడిపించాలి :  మక్కన్ సింగ్

ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ప్రధాని మోదీ చేతిలో భరతమాత బందీ అయ్యిందని ఆరోపించారు. బందీ అయిన భరతమాత విముక్తి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలన్నారు ఎమ్మెల్యే మక్కన్ సింగ్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ముస్లిం యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్-మిలాఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారం కోసం ప్రజలను తప్పుదోవ పట్టుస్తూ, కపట ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని  మక్కన్ సింగ్ కోరారు.