వైస్ ​ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

వైస్ ​ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

డిచ్​పల్లి, వెలుగు: డిచ్​పల్లి మండల వైస్​ ఎంపీపీ శ్యాంరావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సోమవారం ఎంపీడీవో ఆఫీస్​లో ఆర్డీవో రాజేంద్రకుమార్ ​అవిశ్వాస సమావేశం నిర్వహించారు. మండలంలో మొత్తం 17 మంది సభ్యులుండగా సమావేశానికి 11 మంది కోరం ఉంటే సరిపోతుంది.

13 మంది ఎంపీటీసీలు సమావేశానికి అటెండ్​ కావడంతో ఓటింగ్​నిర్వహించారు. 13 మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. ఈ నెల 8న ఎంపీపీ, వైస్​ ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానం నిర్వహించాలని 12 మంది ఎంపీటీసీలు ఆర్డీవో కి లేఖ అందజేశారు. అవిశ్వాసంపై ఎంపీపీ గద్దె భూమన్న హైకోర్టును ఆశ్రయించగా కోర్ట్​స్టే విధించింది. దీంతో కేవలం వైస్​ ఎంపీపీపైనే అవిశ్వాస తీర్మానం నిర్వహించారు.