సినీ నటి రంభకు తృటిలో తప్పిన ప్రమాదం

 సినీ నటి రంభకు తృటిలో తప్పిన ప్రమాదం

సినీ నటి రంభకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె వెళ్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో కొద్ది గాయాలతో రంభ బయట పడ్డారు. గాయాలైన తన కూతురు సాష మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్వయానా రంభనే ట్విట్ చేసి తెలిపింది. ప్రమాద వివరాలు తెలియజేస్తూ.. పిల్లలను స్కూల్ నుండి తీసుకెళ్తున్న ఒక కూడలి వద్ద తమ కారును మరో కారు ఢీకొట్టిందని రంభ పేర్కొంది. కారులో తనతో పాటు తన  పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది.

తమకు చిన్నపాటి గాయాలయ్యాయని రంభ రాసుకొచ్చింది. ప్రస్తుతం తామంతా క్షేమంగా ఉన్నామని.. తన చిన్నారి సాషా ఇంకా ఆసుపత్రిలోనే ఉందని స్పష్టం చేసింది. దేవుడి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ రంభ పోస్ట్ చేసింది. దాంతో పాటు  కారు యాక్సిడెంట్ ఫొటోలను షేర్ చేసిన రంభ...  ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. అందువల్ల, ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. ఈ ఘటనలో కారు డోర్స్ మాత్రం బాగా డ్యామేజ్ అయినట్టు ఫొటోలను చూస్తే తెలుస్తోంది. తాజాగా రంభ చేసిన పోస్ట్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని పోస్టులు చేస్తున్నారు.