రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మోగ్లీ 2025’. డిసెంబర్ 13న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్కు అతిథిగా హాజరైన హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ ‘మోగ్లీ నాకు చాలా ఫేవరెట్. చిన్నప్పుడు నుంచి ఆ క్యారెక్టర్ చూస్తూ పెరిగా. ఆ టైటిల్తో సినిమా రావడం ఆనందాన్ని ఇచ్చింది.
రోషన్ చాలా బాగా నటించాడు. ఆడియెన్స్ సపోర్ట్తో ఈ సినిమా సక్సెస్ అయింది. ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ మాత్రమే మాట్లాడుతుంది. రోషన్ మరింత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు. ఈ మోగ్లీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా అని రోషన్ కనకాల అన్నాడు. ఈ సక్సెస్ని గొప్ప బాధ్యతగా తీసుకుంటున్నా అని సాక్షి మడోల్కర్ చెప్పింది.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘మేము చిన్న సినిమాని తీసాం. కానీ ఆడియెన్స్ చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు. ప్రమోషన్స్కి వెళ్ళిన ప్రతిచోటా మంచి రెస్పాన్స్ దక్కింది’ అని అన్నారు.
