- నన్ను టార్గెట్ చేసి మాట్లాడితే చిట్టా విప్పుతా
- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హెచ్చరిక
నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వై.ఎస్.రాజశేఖర్రెడ్డిని హత్య చేయించిందెవరో తనకు తెలుసని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కామెంట్ చేశారు. తనని టార్గెట్చేసి మాట్లాడితే ఆ చిట్టా విప్పుతానని, అందరి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. తన తండ్రి డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో కాంగ్రెస్ లీడర్లందరి చరిత్ర అంతా తనకు తెలుసునని చెప్పారు. బుధవారం నిజామాబాద్రూరల్సెగ్మెంట్బీజేపీ పార్టీ మీటింగ్లో ఎంపీ అర్వింద్పాల్గొని మాట్లాడారు. ‘నా జోలికి కాంగ్రెస్ లీడర్లు రావద్దు.. చరిత్ర చదివించుకోవద్దు’ అని ఘాటుగా స్పందించారు. పదేండ్లు కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకు తింటే.. మూడు నెలల కింద గవర్నమెంట్ ఏర్పాటు చేసిన రేవంత్రెడ్డి తెలంగాణను అధోగతి పట్టిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ లీడర్లపై ముఖ్యంగా ప్రధాని మోదీపై వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, ఇక నుంచి ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. అలాగే నిజామాబాద్ 6వ డివిజన్కు చెందిన ఇండస్ట్రియలిస్ట్లక్కం భూమేశ్ బుధవారం ఎంపీ అర్వింద్సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వీర శివాజీకి ప్రతిరూపమైన ప్రధాని మోదీ ఉండగా ఔరంగజేబు లాంటి రాహుల్గాంధీ ఎందుకన్నారు. అభివృద్ధి, దేశరక్షణ మోదీకే సాధ్యమని, రాజకీయాలకతీతంగా మేధావులు, విద్యావంతులు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ‘ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ నినాదంతో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తామన్నారు. నిజామాబాద్అర్బన్లో బీజేపీకి లక్ష ఓట్ల మెజారిటీని అందించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యానారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్కులాచారి, నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బస్సాపూర్శంకర్, సుక్క మధు, సుధీర్, మల్లేశ్యాదవ్, శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.