నిజామాబాద్ జిల్లాలో ఆర్వోబీ పెండింగ్ ఫండ్స్ రిలీజ్కు వినతి

నిజామాబాద్ జిల్లాలో ఆర్వోబీ పెండింగ్ ఫండ్స్ రిలీజ్కు వినతి
  • డిప్యూటీ సీఎంను కలిసి ఎంపీ అర్వింద్​

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్వోబీ) నిర్మాణ పనుల నిధులు రిలీజ్ చేయాలని ఎంపీ అర్వింద్​ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. బుధవారం సెక్రటేరియట్​కు వెళ్లిన ఆయన డిప్యూటీ సీఎంను కలిసి మాట్లాడారు. మాధవ్​నగర్​, అర్సాపల్లి, అడివి మామిడిపల్లి ఆర్వోబీలకు చెందిన రూ.13.5 కోట్ల బిల్స్ ఆగిపోయాయని తెలిపారు. దీంతో పనులు జరగడంలేదని చెప్పగా ఫండ్స్​ రిలీజ్​ చేయడానికి డిప్యూటీ సీఎం అంగీకరించినట్లు తెలిపారు.