సింగిడి-2020: రాష్ట్రస్థాయి కళా పోటీలను ప్రారంభించిన బండి సంజయ్

సింగిడి-2020: రాష్ట్రస్థాయి కళా పోటీలను ప్రారంభించిన బండి సంజయ్

కరీంనగర్: మనలోని కళ దేశానికి, సమాజానికి మేలు చేసేలా ఉండాలన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఆదివారం కరీంనగర్ లో.. ఏబీవీపీ – తెలంగాణ రాష్ట్రీయ కళా మంచ్ ఆధ్వర్యంలో  సింగిడి-2020 పేరుతో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కళా పోటీలను ప్రారంభించారు సంజయ్. కార్యక్రమంలో నటుడు సాయికుమార్ తో పాటు పలువురు ప్రాముఖులు పాల్గొన్నారు. విద్యార్ధుల్లో ఉన్న కళలను బయటకు తీసుకొచ్చేందుకే సింగిడి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు బండి సంజయ్.