కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి

కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి

జనగామ అర్బన్, వెలుగు:  కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి కోరారు. గురువారం జనగామలో పర్యటించిన ఆయనకు అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరశురాం ప్రధాని మోదీకి రాసిన పోస్ట్​కార్డును అందించగా సంతకం చేశారు.

 ఈ అంశంపై పార్లమెంట్​లో మాట్లాడతానని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 500 మందితో రాయించిన పోస్ట్​కార్డులను ప్రధానికి పంపిస్తున్నట్లు పరశురాం తెలిపారు. 26 జనవరి 2026 వరకు లక్ష పోస్ట్​కార్డులు పంపనున్నట్లు పేర్కొన్నారు.  డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్​శివరాజ్ యాదవ్, నాయకులు మేడె శ్రీనివాస్, పులి శేఖర్, తిప్పారపు ప్రసాద్, కె.నాగరాజు, కె.ప్రవీణ్​ పాల్గొన్నారు.