టీచర్స్ హక్కులను పరిరక్షించాలి : ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి

టీచర్స్ హక్కులను పరిరక్షించాలి : ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి

యాదాద్రి, వెలుగు: టీచర్స్​హక్కులను పరిరక్షించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి కోరారు. టెట్​ఎగ్జామ్​ తప్పనిసరి చేసిన అంశంపై బుధవారం ఆయన మాట్లాడారు. 2010 ఆగస్టు 23కు విధుల్లో చేరిన టీచర్స్​కు  టెట్​ను తప్పనసరి చేయడం వల్ల ఆందోళన చెందుతున్నారని తెలిపారు. టెట్​ విషయంలో పలుమార్లు భిన్నమైన స్టేట్​మెంట్స్​రావడం వల్ల అనేకమంది టీచర్స్​ టెట్​రాయలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

ఎగ్జామ్​కు హాజరుకాని వారికి ఇప్పుడు మళ్లీ తప్పనిసరి చేయడం సరికాదన్నారు. ఈ కారణంగా టీచర్స్​ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వారి హక్కులను కాపాడడానికి ఆర్​టీఈ 2009, ఎన్​సీటీఈ 1993 యాక్ట్​లను సవరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.