పోలీసు లు కాంగ్రెస్ తాబేదార్లుగా వ్యవహరిస్తున్నరు : ఎంపీ ధర్మపురి అర్వింద్

పోలీసు లు కాంగ్రెస్ తాబేదార్లుగా వ్యవహరిస్తున్నరు : ఎంపీ ధర్మపురి అర్వింద్
  • ఇందుకేనా జీతాలు తీసుకునేది?: ఎంపీ ధర్మపురి అర్వింద్‌
  •     నిజామాబాద్‌లో బీఆర్‌‌ఎస్​ కార్పొరేటర్‌‌ను ఎత్తుకెళ్లిన్రు
  •     మేయర్​ పదవి కోసం కాంగ్రెస్​, మజ్లిస్​అనైతిక సంసారానికి రెడీ అయ్యాయని కామెంట్​

నిజామాబాద్, వెలుగు: మున్సిపల్​ఎన్నికల్లో పోలీసులు కాంగ్రెస్​ పార్టీ తొత్తులుగా పనిచేశారని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ఆరోపించారు. ​ కాంగ్రెస్‌ కోసం నగరపాలక సంస్థలో గెలిచిన బీఆర్‌‌ఎస్​ పార్టీ కార్పొరేటర్‌‌ను ఇంటి నుంచి ఎత్తుకెళ్లడానికి ఏసీపీ, నలుగురు ఎస్ఐలు కష్టపడ్డారని, వారు జీతాలు తీసుకుంటున్నది ఇందుకేనా? అని ప్రశ్నించారు. నిజానికి పోలీసులపై కేసులు పెట్టాలని డిమాండ్​ చేశారు. శనివారం బీజేపీ జిల్లా పార్టీ ఆఫీసులో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘మున్సిపల్​ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్లను పోలింగ్​ బూత్‌ల నుంచి బయటకు పంపారు. కాంగ్రెస్‌కు ఓటేయాలని ఓ బూత్​ వద్ద ఓటర్లను ఓ కానిస్టేబుల్‌ కోరారు. కాంగ్రెస్​ కోసం పోలీసులను వాడుకుంటున్న తీరును ప్రశ్నిస్తే నాపై కేసులు పెట్టిన్రు. 

డిపార్ట్‌మెంట్​చేయాల్సింది ఇదేనా? లా అండ్​ఆర్డర్​ కాపాడడం అంటే ఇట్లనే ఉంటదా?” అని ప్రశ్నించారు. హుందా రాజకీయాలను భ్రష్టు పట్టించినందుకే కేసీఆర్‌‌ను ప్రజలు ఇంటికి పంపారని, సీఎం రేవంత్‌రెడ్డికి అదే పరిస్థితి వస్తది అని అన్నారు. ఎన్నికలప్పుడు బీజేపీకి, మజ్లిస్‌కు సమాన దూరమని  పీసీసీ చీఫ్​ మహేశ్‌కుమార్​గౌడ్​ ప్రచారం చేశారని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.  మరిప్పుడు మేయర్​ పదవి కోసం ఎట్లా  జతకడతారని, ఎట్లా అనైతిక సంసారం చేస్తారని ప్రశ్నించారు.  

కాంగ్రెస్​, మజ్లిస్​ ఒక్కటేనని తాను చెప్పిన మాట ఇప్పుడు నిజం కాబోతున్నదన్నారు.  ‘‘రేవంత్‌రెడ్డి ముద్దాయిగా ఉన్న ఓటుకు నోటు కేసు ఎందుకు స్లోగా వెళ్తుందో ఆరా తీసి స్పీడప్​ చేస్తాం. కేసు విచారణకు ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు అవసరం. ఈ కేసు వేగం పెంచాలని సెంట్రల్​ మినిస్టర్​ కిషన్‌రెడ్డిని ఇది వరకే   డిమాండ్​ చేసిన. ఇప్పుడు మరోసారి కోరుతున్న. కేటీఆర్‌‌పై ఉన్న ఫోన్​ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్​ రేస్​ కేసులను కూడా స్పీడ్​ చేయాలె” అని అన్నారు.