రైతుబంధు,రెండు వేల పింఛన్ కే కుటుంబం గడుస్తుందా.?

రైతుబంధు,రెండు వేల పింఛన్ కే కుటుంబం గడుస్తుందా.?

పది వేల రైతుబంధు, రెండు వేల పింఛన్ కే కుటుంబం గడుస్తుందా అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అర్వింద్. సైనికులను అవమనించేలా కేసీఆర్ చాలా సార్లు మాట్లాడారని..ఇపుడు  రైతులను మోసం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి ఐదేళ్లవుతుందన్నారు.మహిళా గవర్నర్ పై ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు.రాష్ట్రానికి 4 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారన్నారు. రైతులకు మేలు చేయాలన్న ఆలోచన రైతులకు లేదన్నారు. టీఆర్ఎస్ నేతలు దొంగదీక్షలతో  మభ్యపెడుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బాయిల్డ్ రైస్  తెలంగాణలో కూడా కొంటామన్నారు. అన్నదాతను కాపాడాలంటే కేసీఆర్ ను భూస్థాపితం చేయాల్సిందేనన్నారు. కేంద్రం పసుపు దిగుమతులు ఆపి ఎగుమతులు పెంచిందన్నారు. గత రెండేళ్లుగా పసుపు ధరలు పెరుగుతున్నాయన్నారు.

డ్రగ్స్ వాడితే నగర బహిష్కరణే

చిరు సినిమాలో పూరీ స్పెషల్ రోల్

ఎగ్జామ్​ ఏదైనా... జీఎస్​ కామన్​