నా త్యాగాన్ని కాంగ్రెస్ మర్చిపోదు : మందా జగన్నాథం

నా త్యాగాన్ని కాంగ్రెస్ మర్చిపోదు : మందా జగన్నాథం

కల్వకుర్తి, వెలుగు: తన త్యాగాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోదని, నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్​ఇస్తుందని కేటాయిస్తుందని -మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కల్వకుర్తిలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్​నియంత పోకడలు, అవినీతి, నిర్లక్ష్యపు పాలనను తట్టుకోలేకనే, రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారన్నారు.

బీఆర్ఎస్​అధిష్ఠానం సొంత పార్టీ నేతలనే అవమానించిందని, హామీలు నెరవేర్చకుండా మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. తట్టుకోలేకనే ఢిల్లీలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్న తాను, రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరానని గుర్తుచేశారు. ఆయన వెంట నాగర్ కర్నూల్​జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, నాయకులు ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి, అశోక్ రెడ్డి, శ్రీకాంత్, వెంకటేశ్, సంతు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.