
తనకు పేరుతెచ్చిన తెలుగు ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు మహారాష్ర ఎంపీ నవనీత్ కౌర్. తిరుమల శ్రీవారిని ఫ్యామిలీతో దర్శించుకున్న నవనీత్ కౌర్.. చాన్స్ వస్తే తెలుగు వాళ్ళకు సేవ చేస్తానన్నారు. ఏ సమస్య వచ్చినా రెడీగా ఉన్నానన్నారు. దేశంలో కరోనా తగ్గి ప్రజలు సంతోషంగా ఉండాలని కోరారు. సోషల్ మీడియాలో ఎవరైనా సమస్యకోసం ఫిర్యాదు చేస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.