
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ కామ విజయ్ తండ్రి రాజలింగు బుధవారం అనారోగ్యంతో చనిపోయారు. బుధవారం రాత్రి గోదావరి ఒడ్డున నిర్వహించిన అంత్యక్రియల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.
రాజలింగు పార్థివదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. విజయ్, ఆయన సోదరులను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పీసీసీ సభ్యుడు రఘునాథ్ రెడ్డి, లీడర్లు పి.మల్లికార్జున్, సంజీవ్, అనుమాస శ్రీనివాస్ (జీన్స్), నరేందర్ రెడ్డి, జావెద్, సురేందర్, తదితరులున్నారు.