కొత్తగూడెంను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

కొత్తగూడెంను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ వంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ, బీఆర్ఎస్​ నియోజకవర్గ ఇన్​చార్జి వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. బుధవారం కొత్తగూడెంలోని బార్​అసోసియేషన్​ హాల్​లో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కార్ ​కట్టుబడి ఉందన్నారు.

ఇప్పటికే రూ. వంద కోట్లు కేటాయించిందని, దీనిని భవిష్యత్​లో రూ. 500 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వారికి ఇండ్ల స్థలాలు, హెల్త్​ ఇన్స్​రెన్స్ రూ.5లక్షలకు పెంచుతామన్నారు. కోర్టు భవనాలు, న్యాయమూర్తుల భవన సముదాయాలకు ప్రభుత్వం కొత్తగూడెంలో 10 ఎకరాల స్థలం కేటాయించిందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్​ క్యాండిడేట్​, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్​ నేత ఎడవల్లి కృష్ణ పాల్గొన్నారు. 

పాల్వంచలో ప్రచారం.. 

పాల్వంచ పట్టణంలోని ఇందిరా నగర్​ కాలనీ, శివానగర్​, బాలాజీ నగర్​, వెంకటేశ్వర హిల్స్​ తో పాటు పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను రూ. వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 

ALSO READ : నమ్మకమా.. అతినమ్మకమా? తేడా కొట్టిందంటే అంతే సంగతులు!