భద్రాచలం సబ్ కలెక్టర్గా మృణాళ్ శ్రేష్ఠ

భద్రాచలం సబ్ కలెక్టర్గా మృణాళ్ శ్రేష్ఠ

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సబ్​కలెక్టర్​గా మృణాళ్​ శ్రేష్ఠను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 2023 ఐఏఎస్​బ్యాచ్​ బిహార్ ​క్యాడర్ కు చెందిన మృణాళ్ శ్రేష్ఠ 2024 ఏప్రిల్​ 15వ తేదీన తెలంగాణకు కేటాయించగా, ఖమ్మం జిల్లాలో కొంత కాలం ట్రైనీ ఐఏఎస్​గా పనిచేశారు. ట్రైనింగ్​ అనంతరం ఇప్పుడు భద్రాచలం సబ్​కలెక్టర్​గా నియమితులయ్యారు. కాగా భద్రాచలం ఆర్డీవోగా 2024 మార్చి 4వ తేదీన బాధ్యతలు స్వీకరించిన దామోదర్​రావును బదిలీ చేశారు. ఆయనకు ఇంకా ఎక్కడా పోస్టింగ్​ఇవ్వలేదు.