
న్యూఢిల్లీ: జియో ప్లాట్ఫారమ్స్ శ్రీలంక యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ కంపెనీ లంక టెలికాం పీఎల్సీ లో సర్కారు వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. మొత్తం మూడు సంస్థలు ఈ వాటాను కొనడానికి ఆసక్తి చూపించాయి. జాతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లో తన వాటాను ఉపసంహరించుకోవాలని లంక నిర్ణయించుకుంది. వాటా కొనుగోలు కోసం పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. అప్లికేషన్లకు దాఖలు గడువు జనవరి 12తో ముగిసిన తర్వాత, గార్ట్యూన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్, పెట్టిగో కమర్షియో ఇంటర్నేషనల్, జియోలను బిడ్డర్లుగా లంక ప్రభుత్వం గుర్తించింది.