
ఢిల్లీని మించిన కాలుష్యంతో ప్రమాదపు అంచుల్లోకి
ఫస్ట్ ప్లేస్లో పాక్లోని లాహోర్
‘ఐక్యూ ఎయిర్’ సర్వేలో వెల్లడి
ముంబై : ప్రపంచంలో రెండో అత్యంత కలుషిత నగరంగా ముంబై నిలిచింది. మన దేశంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కూడా ఇదే. స్విట్జర్లాండ్ కు చెందిన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ తాజాగా నిర్వహించిన వీక్లీ సర్వేలో ఈవివరాలు వెల్లడయ్యాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల గాలి నాణ్యతను తనిఖీ చేసి ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ను ఐక్యూ ఎయిర్ రూపొందించింది. ఇంతకుముందు వరకు దేశంలో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ ఉండగా.. ఇప్పుడా స్థానంలోకి ముంబై వచ్చింది. ఆశ్చర్యకరంగా ఈసారి కలుషిత నగరాల టాప్10 లిస్టులో ఢిల్లీ పేరు లేదు. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్ సిటీగా పాకిస్తాన్లోని లాహోర్ నిలిచింది.
ముంబై తర్వాతి స్థానాల్లో వరుసగా కాబూల్ (అఫ్ఘానిస్తాన్), కావో హిసియుంగ్(తైవాన్), బిష్కెక్ (కిర్గిజ్స్తాన్), ఆక్రా (ఘనా), క్రాకో (పోలండ్), దోహా (ఖతర్), అస్తనా (కజకిస్తాన్), శాంటియాగో (చిలీ) ఉన్నాయి. ఎయిర్ క్వాలిటీ సర్వే చేయడంలో ‘ఐక్యూ ఎయిర్’కు యునైటెడ్ నేషన్స్ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్ఈపీ), గ్రీన్ పీస్ సంస్థలు సహకరించాయి. ఈ స్టడీ కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నుంచి కాలుష్యం, గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు.