దుబ్బాక అభివృద్ధికి రూ. 19.40 కోట్లు

దుబ్బాక అభివృద్ధికి రూ. 19.40 కోట్లు

దుబ్బాక, వెలుగు: దుబ్బాక పట్టణాన్ని రూ. 19.40 కోట్లతో డెవలప్​ చేయాలని మున్సిపల్​ కౌన్సిల్​ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంగళవారం చైర్​పర్సన్​గన్నె వనిత అధ్యక్షతన మున్సిపల్​ బడ్జెట్​సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి ముఖ్య అథితిగా హాజరై పట్టణ అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు. 

దుబ్బాక పట్టణం నుంచి మండల పరిధిలోని హబ్షీపూర్​ వరకు ఫోర్​లైన్​ తారు రోడ్డు, మున్సిపాల్టీ చుట్టూ రింగ్​రోడ్డు, కేసీఆర్​స్కూల్​నిర్వహణ, వంద పడకల హాస్పిటల్​పూర్తి స్థాయి స్టాఫ్,​ నాన్​వెజ్, వెజ్ మార్కెట్, ఆడిటోరియం, మినీ స్టేడియం, స్విమ్మింగ్​ పూల్​ సౌకర్యం, అండర్​ డ్రైనేజ్​ వ్యవస్థ, వారాంతపు సంతకు స్థల పరిశీలన, ​పట్టణం చుట్టూ ఉన్న చెరువులు, కుంటల సుందరీకరణ, అసంపూర్తిగా ఉన్న శ్మశాన వాటికల, కుల సంఘాల భవనాలను పూర్తి చేయాలని కౌన్సిల్​ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సమావేశంలో కమిషనర్​రమేశ్​కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.