పుర పోరుకు రెడీ.. నిజామాబాద్ నగరపాలక, మున్సిపాలిటీల్లో 146 స్థానాలు 

పుర పోరుకు రెడీ.. నిజామాబాద్ నగరపాలక, మున్సిపాలిటీల్లో 146 స్థానాలు 
  • సర్వం సిద్ధం చేసిన ఉమ్మడి జిల్లా యంత్రాంగం 
  • నిజామాబాద్​ నగరపాలక, మున్సిపాలిటీల్లో 146 స్థానాలు 
  • కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో 92 వార్డులు

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు: పురపాలక ఎన్నికలకు ఉమ్మడి జిల్లాయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించడంతో కోడ్ అమల్లోకి వచ్చింది.  నిజామాబాద్ కార్పొరేషన్​తోపాటు, ఆర్మూర్​, భీంగల్​, బోధన్ ​మున్సిపాలిటీల్లో 146 స్థానాలు, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుంద మున్సిపాలిటీల్లో 92 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం సెంటర్లను ఏర్పాటు చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్వోలు) బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్​లు తీసుకుంటారు. 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తుంది.  

నిజామాబాద్​ కార్పొరేషన్​... 

నిజామాబాద్​ కార్పొరేషన్​లో 60 డివిజన్లు ఉండగా, 348,051 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,67,461 మంది,  మహిళలు 1,80,546 మంది, ఇతరులు 44 మంది ఉన్నారు. ప్రతి మూడు డివిజన్లకు ఒకటి చొప్పున నామినేషన్ సెంటర్​ ఏర్పాటు చేశారు. 1, 2, 3 డివిజన్లు (గూపన్​పల్లి వార్డ్ ఆఫీస్​), 4,  5, 6 డివిజన్లు (సీఆర్​సీ బిల్డింగ్​, వినాయక్​నగర్​), 7,  8,  9 డివిజన్లు (లేబర్​ ఆఫీస్​, శివాజీనగర్​), 10, 11, 12 డివిజన్లు (అంబేద్కర్ భవన్​, నాగారం), 13, 14, 15 డివిజన్లు (ఫిషరీస్ ఆఫీస్​, బోధన్ రోడ్​), 16, 17, 18 డివిజన్లు (కమ్యూనిటీ హాల్​, వాటర్​ ట్యాంక్​, గౌతంనగర్​),  19, 20, 21 డివిజన్లు (జోన్​-4 ఆఫీస్​, వాటర్​ ట్యాంక్​, కంఠేశ్వర్​), 22, 23, 24 డివిజన్లు (మహిళా భవన్​, కమ్యూనిటీ హాల్​, వినాయక్​నగర్​), 25, 26, 27 డివిజన్లు (టీటీడీ కల్యాణ మండపం, పులాంగ్​ చౌరస్తా), 28, 29, 30 డివిజన్లు (గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ఖిల్లా),  31, 32, 33 డివిజన్లు  (జోన్​-4 ఆఫీస్, అర్సాపల్లి వాటర్ ట్యాంక్​), 34, 35, 36 డివిజన్లు (హమాల్​వాడీ ఆఫీస్​), 37, 38, 39 డివిజన్లు (జోన్​-1 ఆఫీస్​, నాందేవ్​వాడ), 40, 41, 42 డివిజన్లు (జోన్​-4, శానిటరీ వార్డ్​ ఆఫీస్​, కంఠేశ్వర్​), 43, 44, 45 డివిజన్లు (రాజీవ్​ గాంధీ ఆడిటోరియం), 46, 47, 48 డివిజన్లు (జోన్​-2 ఆఫీస్, గోల్​ హనుమాన్ వాటర్​ ట్యాంక్​), 49, 50, 51 డివిజన్లు (జోన్​-3 ఆఫీస్​, బడాబజార్ వాటర్​ ట్యాంక్​), 52, 53, 54 డివిజన్లు (గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీ, ఖిల్లా)​, 55, 56, 57 డివిజన్లు (జోన్​-3 ఆఫీస్​, బడాబజార్​ వాటర్​ ట్యాంక్​), 58, 59, 60 డివిజన్లు (జోన్​-3 ఆఫీస్​ బడాబజార్​ వాటర్​ ట్యాంక్​) నామినేషన్​ సెంటర్లను ఏర్పాటు చేశారు. 

బోధన్​ మున్సిపాలిటీ..

బోధన్​ మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డులు 69,417 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 33,696 మంది, మహిళలు 35,720 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. 1 నుంచి 24 వార్డుల నామినేషన్ల స్వీకరణకు బోధన్ గవర్నమెంట్ జూనియర్​ కాలేజీలోని 8 రూమ్​లు ఏర్పాటు చేశారు. 25 నుంచి 38 వార్డుల నామినేషన్లు గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీ బిల్డింగ్​లోని ఐదు రూముల్లో నామినేషన్లు తీసుకుంటారు.

ఆర్మూర్ ​మున్సిపాలిటీ..

ఆర్మూర్​ మున్సిపాలిటీలో 36 వార్డులు, 63,972 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 30,648 మంది, మహిళలు 33,322 మంది ఉన్నారు. అక్కడి గవర్నమెంట్ జూనియర్​ కాలేజీ బిల్డింగ్​లో ఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారు.

భీంగల్ ​మున్సిపాలిటీ..

భీంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులుండగా, 14,045 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 6,616 మంది, మహిళలు 7,429 మంది ఉన్నారు.  భీంగల్​ ఎంపీడీవో ఆఫీస్​లో 12 వార్డుల నామినేషన్లు స్వీకరిస్తారు.  

కామారెడ్డి మున్సిపాలిటీ..

కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా,  99,313 మంది ఓటర్లు ఉన్నారు.  152 పోలింగ్​ స్టేషన్లు, 17 నామినేషన్ల సెంటర్లను ఏర్పాటు చేశారు.  ఆర్వోలు, అసిస్టెంట్ ఆర్వోలు  21 మంది చొప్పున నియమించారు.  జోనల్ అధికారులు 13 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్స్​ 2, ఎస్​ఎస్​టీలు 2 టీమ్స్ నియమించారు.

బాన్సువాడ మున్సిపాలిటీ..

బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులు ఉండగా,  24,188 మంది ఓటర్లు ఉన్నారు. 39 పోలింగ్​ కేంద్రాలు, 7 నామినేషన్ల సెంటర్లను ఏర్పాటు చేశారు.  రిటర్నింగ్​, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు  9 మంది చొప్పున నియమించారు. జోనల్ అధికారులు  4,  ఫ్లయింగ్ స్వాడ్స్​ 2, ఎస్ఎస్​టీ టీమ్స్​ 2 పని చేస్తాయి.

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ..

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12  వార్డులు ఉండగా 13,265 మంది ఓటర్లు ఉన్నారు. 24 పోలింగ్​ స్టేషన్లు, 4 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  రిటర్నింగ్​, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 5 చొప్పున నియమించారు. ఫ్లయింగ్​ స్వ్కాడ్స్​ 2, ఎస్​ఎస్​టీ టీమ్స్​ 2 నియమించారు.

బిచ్​కుంద మున్సిపాలిటీ..

బిచ్​కుంద మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా, 12,759 మంది ఓటర్లు ఉన్నారు. 24 పోలింగ్​ కేంద్రాలు, 4 నామినేషన్​ సెంటర్లను ఏర్పాటు చేశారు.  రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 5 చొప్పున నియమించారు.  ఫ్లయింగ్ స్వ్కాడ్స్​ 2, ఎస్​ఎస్​టీ టీమ్స్​ 2 ఏర్పాటు 
చేశారు.  

నామినేషన్​తో జత చేయాల్సిన సర్టిఫికెట్లు.. 

నామినేషన్​ పత్రంలో పాటు  ఏఏ సర్టిఫికెట్లు జతపర్చాలో అధికారులు సూచించారు. నామినేషన్​ ఫారం, బర్త్ సర్టిఫికెట్ ( ఎస్సెస్సీ  జిరాక్స్​, ఓటరు ఐడీ కార్డు జిరాక్స్​/ఆధార్​ కార్డు జిరాక్స్​) జత చేయాలి.  రిజర్వుడు స్థానాల్లో కుల సర్టిఫికెట్, సెల్ప్​ ఆఫిడవిట్​ ( ఆస్తులు/ విద్యార్హతలు), బ్యాంక్​ అకౌంట్ ( కొత్తగా తీయాలి),  ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటిస్తానని సెల్ప్​ డిక్లరేషన్ ప్రాపర్టీ నో డ్యూ సర్టిఫికెట్​( అభ్యర్థి/ ప్రతిపాదకుల), 2 ఫొటోలు జత చేయాల్సి ఉంటుంది.