రిహాబిలిటేషన్ సెంటర్‎లో వ్యక్తి హత్య.. ప్లైవుడ్డోర్ముక్కతో కొట్టి చంపిన దుండగులు

రిహాబిలిటేషన్ సెంటర్‎లో వ్యక్తి హత్య.. ప్లైవుడ్డోర్ముక్కతో కొట్టి చంపిన దుండగులు

మియాపూర్, వెలుగు: డ్రగ్స్‎కు బానిసలై చికిత్స పొందుతున్న ముగ్గురు వ్యక్తులు గొడవపడగా.. వారిలో ఇద్దరు కలిసి మరో వ్యక్తిని హత్య చేశారు. ఈ సంఘటన మియాపూర్ ​పోలీస్ స్టేషన్​ పరిధిలోని ఓ రిహాబిలిటేషన్ సెంటర్​లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సందీప్(39) డ్రగ్స్‎కు అలవాటు పడ్డాడు. అతనికి చికిత్స అందించేందుకు కుటుంబసభ్యులు 8 నెలల కింద మియాపూర్‎లోని రిహాబిలిటేషన్​సెంటర్‎లో చేర్పించారు.

ఇదే సెంటర్‎లో డ్రగ్స్‎కు బానిసలైన నల్గొండకు చెందిన ఆదిల్, నగరంలోని బార్కస్‎కు చెందిన సులేమాన్ నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రం కౌన్సెలింగ్ క్లాస్‎కు వెళ్లే సమయంలో ఈ ముగ్గురూ గొడవ పడ్డారు. ఆదిల్, సులేమాన్​ప్లైవుడ్​డోర్​ముక్కతో సందీప్ ముఖంపై విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని సిబ్బంది దగ్గరలోని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సందీప్​అదే రోజు రాత్రి మృతిచెందాడు. పోలీసులు అతని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‎కు తరలించారు. సులేమాన్, ఆదిల్‎ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.