మర్డర్ అటెమ్ట్: పోలీస్టేషన్ నుంచి తప్పించుకున్నాడు

మర్డర్ అటెమ్ట్: పోలీస్టేషన్ నుంచి తప్పించుకున్నాడు

మాజీ భార్యను చంపడానికి ప్రయత్నించిన ఓ యువకుడు పోలీసుల అదుపునుంచి తప్పించుకున్నాడు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని బండ్లగూడ యడవమిత్ర కాలనిలోని బోరాబండ లో సాయికిరణ్, లావణ్య దంపతులు ఇద్దరి పిల్లలతో కలిసి నివాసం ఉండేవారు. అయితే వారి సంసారంలో కొట్లాటలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి లావణ్య అదే ఏరియాలో పిల్లలతో కలిసి వేరేగా ఉంటూ.. ప్రైవేట్ కొలువు చేసుకుంటూ బతుకుతుంది.

లావణ్యపై కోపం పెంచుకున్న ఆమె మాజీ భర్త సాయికిరణ్ ఆమెను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేశాడు. ఈ రోజు పొద్దున 10గంటల ప్రాంతంలో లావణ్యను చంపడానికి వేట కొడవలితో ఆమె ఉన్న ఇంటికి వెళ్లాడు. పరిస్థితిని గమనించిన లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాయికిరణ్ ను పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.  మద్యం మత్తులో ఉన్న అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే సాయికిరణ్ పోలీసుల కళ్లు గప్పి కత్తితో పాటు పారిపోయాడు.  ప్రస్తుతం పోలీసులు అతని కోసం వెదుకుతున్నారు.