మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తల్లి కన్నుమూత

మ్యూజిక్ డైరెక్టర్  కీరవాణి తల్లి కన్నుమూత

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి బాల సరస్వతి ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం కన్నుమూశారు. వయసు రిత్యా అనారోగ్య సమస్యల వల్ల కిమ్స్ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె.. ఇవాళ తుది శ్వాస విడిచారు.

దర్శకధీరుడు రాజమౌళికి ఆమె పిన్ని అవుతారు. దీంతో కీరవాణి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాసేపట్లో ఆమె మృతదేహాన్ని రాజమౌళి ఇంటికి తరలించనున్నారు.