
రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే తొంభై శాతం షూటింగ్ పూర్తయింది. మ్యూజిక్ ఫెస్టివల్ బిగిన్స్ అంటూ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఫస్ట్ సాంగ్కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘సితార్’ అంటూ సాగే మొదటి పాటను జులై 8న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే స్టైలిష్ లుక్లో ఇంప్రెస్ చేస్తున్నారు. ఇదొక డ్యూయెట్ సాంగ్ అని, ఇటీవల కాశ్మీర్ వ్యాలీలో ఈ పాటను చిత్రీకరించినట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ పాటలోని విజువల్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయన్నారు. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టి సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.