
- మంచి కామెంట్లు పెడితే సీఎం, కేటీఆర్మాట్లాడుతరు
- టీఆర్ఎస్ సోషల్మీడియా స్టేట్ కన్వీనర్ దినేశ్ చౌదరి
యాదాద్రి, వెలుగు : ‘సోషల్మీడియాను ఉపయోగించుకోవడంలో మనం వెనుకబడ్డాం. మన లీడర్ల స్పీచ్తో పాటు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత స్పీచ్కు తక్కువ లైక్లు వస్తున్నయ్. దీన్ని మెరుగుపర్చుకోవాలె’ అని టీఆర్ఎస్ సోషల్మీడియా స్టేట్ కన్వీనర్ దినేశ్ చౌదరి అన్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో టీఆర్ఎస్ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగం కార్యకర్తలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతపై కొన్ని పత్రికల్లో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్లను..దాని కింద ఉన్న లైక్లను చూపిస్తూ ఇంత తక్కువ రావడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటి నుంచి అందరూ ఎమ్మెల్యే సునీత సహా టీఆర్ఎస్పార్టీ లీడర్ల స్పీచ్ను సోషల్మీడియాలో అప్లోడ్ చేయడంతో పాటు షేర్ చేస్తూ ఎక్కువగా లైక్లు కొట్టాలని సూచించారు.
సోషల్మీడియాలో మంచి కామెంట్లు చేసిన కార్యకర్తలతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేరుగా ఫోన్లో మాట్లాడుతారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లీడర్ల కామెంట్లకు వెంటనే కౌంటర్ ఇవ్వాలన్నారు. ప్రజలకు అన్నీ చేస్తున్నా సోషల్ మీడియాను వాడుకోవడంలో వెనకబడ్డామని ఎమ్మెల్యే సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ ఉన్నారు.