మాస్ మహారాజా ‘రవితేజ’ ఫుల్ జోష్ లో దూసుకెళుతున్నాడు. ‘క్రాక్’ హిట్ మూవీ అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేసేస్తున్నాడు. లేటెస్ట్ గా ‘ధమాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ జరుపుతోంది. వరుస ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ప్రమోషన్స్ ను కొత్తగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు రవితేజ ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ముగ్గురు దర్శకులతో రవితేజ దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
స్టార్ డైరెక్టర్లు గోపీచంద్ మలినేని, బాబీ, అనిల్ రావిపూడిలు ఆ ఫొటోలో ఉన్నారు. ‘‘నాకు బ్లాక్బస్టర్స్ అందించిన డైరెక్టర్స్ నన్ను ఇంటర్వ్యూ చేయనుండటం సంతోషంగా ఉంది” అని రవితేజ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ధమాకేదార్ ఇంటర్వ్యూను రేపు రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ధమాకా’ సినిమాలో రవితేజ సరసన అందాల భామ శ్రీలీల హీరోయిన్గా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.