అనుమతి లేకుండా బోర్డు పెట్టినందుకు 5 వేల జరిమానా

అనుమతి లేకుండా బోర్డు పెట్టినందుకు 5 వేల జరిమానా

హైదరాబాద్, వెలుగు : అనుమతి లేకుండా బోర్డు ఏర్పాటు చేసినందుకు మై హోమ్ సంస్థకు జీహెచ్ఎంసీ అధికారులు  రూ.5 వేల ఫైన్ వేశారు. ఈ మేరకు సెంట్రల్ ఎన్ఫోర్స్ మెంట్ సెల్ ఆన్ లైన్లో చలాన్ జనరేట్ చేసింది. టోలిచౌకిలోని మై హోమ్  భుజా మార్కెటింగ్ ఆఫీసుకు దారి అంటూ ఏర్పాటు చేసిన బోర్డుకు చలాన్ వేశారు. టోలిచౌకిలో అనుమతి లేకుండా హోర్డింగ్ ఏర్పాటు చేసిన లిమ్రా హోటల్ కు రూ.లక్ష, అమీర్ పేట మెట్రో ఫిల్లర్లకు పోస్టర్లు వేసిన జెన్యూన్ ఫెసిలిటీ సర్వీసెస్ కు రూ.8 వేల జరిమానా విధించారు. అయితే టీ స్టాల్స్ కి సైతం రూ.10 వేలకు పైగా ఫైన్లు వేస్తున్న జీహెచ్​ఎంసీ.. మై హోమ్ సంస్థకు కేవలం రూ.5 వేలు ఫైన్ వేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.