లండన్ లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా మేట్ పావిక్ జంట సెమీస్లోకి ప్రవేశించింది. సోమవారం రాత్రి గ్యాబ్రియేలా డాబ్రోవ్స్కీ జాన్ పీర్స్ జోడీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సానియా జోడీ చక్కటి ఆటతీరుతో గెలిచింది. 1 గంట 41 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో మూడు వరుస సెట్లలో 6–4, 3–6, 7–5 పాయింట్లతో విజయఢంకా మోగించింది. 2022 తనకు చివరి సీజన్ అని, దాని తర్వాత రిటైర్ అవుతానని సానియా ఇటీవల ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆమె కెరీర్లో చివరి అతిపెద్ద టోర్నీగా మారిన వింబుల్డన్లో సెమీస్ కు చేరడాన్ని సానుకూల పరిణామంగా అభివర్ణిస్తున్నారు.
క్వార్టర్ ఫైనల్స్ లోకి రఫెల్ నడాల్
మరోవైపు వింబుల్డన్లోనూ రఫెల్ నడాల్ చెలరేగుతున్నాడు.డచ్ టెన్నిస్ ప్లేయర్ బోటిక్ వాన్ డీ జాండ్షల్ప్ తో జరిగిన మ్యాచ్ లో 6–4 , 6–2, 7–6 పాయింట్ల తేడాతో గెలిచిన నడాల్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరగనున్న సెమీస్ లో అమెరికా టెన్నిస్ ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్ ను నడాల్ ఢీకొననున్నారు.