Nagarjuna: తప్పు మాదే.. తోసేసిన అభిమానిని కలిసిన నాగార్జున

Nagarjuna: తప్పు మాదే.. తోసేసిన అభిమానిని కలిసిన నాగార్జున

అక్కినేని నాగార్జునపై గత వారంరోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎయిర్పోర్ట్ లో కనిపించిన నాగార్జునతో ఫోటో దిగడానికి ఒక అభిమాని ముందుకు రాగా.. నాగార్జున బాడీగార్డ్స్ ఆ వ్యక్తిని పక్కకు తోసేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నాగార్జున అదంతా పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. దాంతో.. నాగార్జునపై సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది. అయితే.. వెంటనే ఆ విషయంపై స్పందించిన నాగార్జున ఆ అభిమానికి క్షమాపణలు కూడా చెప్పారు. 

అయితే.. తాజాగా ఆ అభిమానిని డైరెక్ట్ గా కలిశారు నాగార్జున. తాజాగా అదే ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన నాగార్జున ఆ వ్యక్తిని దగ్గరికి పిలిపించి కలిసి  కాసేపు మాట్లాడారు. దాంతో ఆ వ్యక్తి చాలా సంతోషించారు. ఆరోజు జరిగిన దాంట్లో తప్పు మాదే అని కూడా ఒప్పుకున్నారు నాగార్జున. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా ఎంమారింది. ఇక నాగార్జున చేస్తున్న సినిమాల విషయానికి వస్తే..   ఇటీవలే నా సామిరంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం కుబేర సినిమా చేస్తున్నారు. 

టాలీవుడ్ సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల  తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్నారు.నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.