నాగార్జున మటన్ బిర్యానీ ఎక్కడిది..! : హైదరాబాద్ బిర్యానీ పేరు మారిందా బ్రో

నాగార్జున మటన్ బిర్యానీ ఎక్కడిది..! : హైదరాబాద్ బిర్యానీ పేరు మారిందా బ్రో

బిర్యానీ అనగానే హైదరాబాద్ బిర్యానీ గుర్తుకొస్తుంది.. ఇంకా కొంచెం ముందుకు వెళితే బావార్చీ, ప్యారడైజ్, షాగోస్ లాంటి టాప్ బ్రాండెడ్ బిర్యానీలు గుర్తుకొస్తాయి.. ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త బిర్యానీ ఒకటి వచ్చింది.. దాని పేరు ఏంటో తెలుసా.. నాగార్జున మటన్ దమ్ బిర్యానీ.. ఎస్. ఇప్పుడు ఈ నాగార్జున మటన్ బిర్యానీ హాట్ టాపిక్ అయ్యింది హైదరాబాద్ సిటీలో.. పూర్తి వివరాలు ఏంటో చూద్దామా...

మొన్నటికి మొన్న మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ సిటీలోని ఎన్.కన్వర్షన్ సెంటర్ లో జరిగింది కదా.. అక్కడికి వెళ్లిన అతిధులకు ఓ పేరు భలే ఆకర్షించిందంట.. దాని పేరు నాగార్జున మటన్ దమ్ బిర్యానీ.. ప్రతి వంట ఐటమ్ దగ్గర దానికి సంబంధించిన పేరు పెట్టటం కామన్.. అలాగే ఓ ఐటమ్ దగ్గర నాగార్జున మటన్ దమ్ బిర్యానీ అని బోర్డు ఉందంట.. ఈ విషయాన్ని ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర వర్మ తన ఇన్ స్ట్రాలో పోస్టు చేయటంతో వైరల్ అయ్యింది.

వరుణ్ తేజ్ రిసెప్షన్ జరిగింది ఎన్.కన్వెన్షన్ సెంటర్ లో.. ఇది నాగార్జునదే అని అందరికీ తెలిసిందే.. సో.. తన కన్వెన్షన్ లో జరిగే వేడుకల్లో తన పేరుపై.. మటన్ దమ్ బిర్యానీని ఆఫర్ చేస్తున్నట్లు నెటిజన్లు అంటున్నారు. వరుణ్ తేజ్ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావటంతో.. స్పెషల్ ఈ నాగార్జున మటన్ దమ్ బిర్యానీని చేయించినట్లు చెబుతున్నారు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు. 

ఏది ఏమైనా.. హైదరాబాద్ బిర్యానీకి పోటీగా.. ఇప్పుడు నాగార్జున మటన్ దమ్ బిర్యానీ రాబోయే రోజుల్లో మంచి కాంపిటీషన్ ఇవ్వొచ్చంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.. అయినా సినిమా హీరోలు తలచుకుంటే బ్రాండ్లకు కొదవా ఏంటీ బ్రో..