
ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ డ్యామ్ కు వరద పోటెత్తోంది. సాగర్ లో వాటర్ లెవల్ అంతకంతకు పెరుగుతుండటంతో 20 గేట్లను ఎత్తి వాటర్ రిలీజ్ చేస్తున్నారు. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో 2లక్షల 10వేల 408 క్యూసెక్కులుండగా..ఔట్ ఫ్లో సేమ్ లెవల్ లో కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా..ప్రస్తుత నీటిమట్టం అంతేమేర కొనసాగుతోంది. నాగార్జున సాగర్ 20గేట్లను ఓపెన్ చేయటంతో పరివాహక ప్రాంతవాసులు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read:-సిన్సియర్గా లవ్ చేసి మోసపోయా
ఎగువన కర్ణాటకలో జోరుగా కురుస్తున్న వర్షాలతో..శ్రీశైలాం డ్యామ్ కు వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారాటంతో...ఏడు గేట్లను పది అడుగులమేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి ఇన్ ఫ్లో 2 లక్షల 62 వేల 462 క్యూసెక్కులు రాగా...ఔట్ ప్లో 2లక్షల 65వేల 233లుగా నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం సేమ్ లెవల్ లో కొనసాగుతోంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది.