నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కు రేపటి తో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఎలక్షన్ కమిషన్ గత మూడు రోజులుగా సెలవులుగా ప్రకటించింది. రేపు(మంగళవారం-30)ఒక్క రోజే నామినేషన్ దాఖలు కు అవకాశం ఉంది. ఇప్పటి వరకు 20 మంది అభ్యర్ధులు 23 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. డీటీపీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేశారు మువ్వ అరుణ్ కుమార్. అభ్యర్థి గా ప్రకటించకుండానే నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ నేత కంకణాల నివేదిత రెడ్డి. రేపు నామినేషన్ వేయనున్నారు కాంగ్రెస్, టీఆర్ ఎస్ అభ్యర్థులు . మరోవైపు ఇప్పటి వరకు ఏ పార్టీలకు మద్దతు ఇస్తున్నామనే క్లారిటీకి రాలేదు వామపక్షాలు.