V6 News

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించండి : కలెక్టర్  బదావత్  సంతోష్

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించండి : కలెక్టర్  బదావత్  సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్  బదావత్  సంతోష్  సూచించారు. సోమవారం నాగర్ కర్నూల్  మున్సిపాలిటి పరిధిలోని ఓ గార్డెన్​లో ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఎన్నికల రోజు పోలింగ్  కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాలెట్  బాక్సుల నిర్వహణ, రూల్స్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. .

ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు సక్సెస్​ చేయాలన్నారు. కేంద్రాల వద్ద వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు సౌలతులు కల్పించాలని సూచించారు. పోలింగ్  కేంద్రాల్లోకి ఏజెంట్లను  మాత్రమే అనుమతించాలన్నారు. అనంతరం తాడూరు ఎంపీడీవో ఆఫీస్​లో పోస్టల్  బ్యాలెట్  పోలింగ్ మెటీరియల్ ను  పరిశీలించారు.