
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన ప్రముఖ అథ్లెటిక్స్ కోచ్, ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్కు ప్రమోషన్ లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సీనియర్ కోచ్గా పని చేస్తున్న రమేశ్ ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ టీమ్ చీఫ్ కోచ్గా అపాయింట్ అయ్యాడు. చాన్నాళ్లుగా హైదరాబాద్లోని సాయ్ సెంటర్లో పని చేస్తున్న రమేశ్ ఒలింపిన్ ద్యుతీ చంద్, సత్తె గీత, ఎంఆర్ పూవమ్మ, జీవాంజి దీప్తి తదితరులను తీర్చిదిద్దాడు.
2004 నుంచి ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ అథ్లెటిక్స్, ఆసియా గేమ్స్ తదితర మెగా ఈవెంట్లలో ఇండియా కోచ్గా పని చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అథ్లెటిక్స్లో ద్రోణాచార్య అవార్డు (2016) అందుకున్న, జూనియర్ టీమ్ చీఫ్ కోచ్ అయిన తెలంగాణ తొలి వ్యక్తిగా రమేశ్ రికార్డు సృష్టించాడు.