
పంజాగుట్ట, వెలుగు: బాలికతో అసభ్యరకంగా ప్రవర్తించిన వ్యక్తికి నాంపల్లి అడిషనల్సెషన్స్ జడ్జి 20 ఏండ్లు జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్టి.శ్రీనాథ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడకు చెందిన జి.రామకృష్ణ(44) డ్రైవర్గా పనిచేస్తుంటాడు. 2022 లో ఓ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
బాధితుల ఫిర్యాదుతో అప్పటి ఇన్స్పెక్టర్సైదులు రామకృష్ణపై పోక్సో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నాంపల్లి అడిషనల్సెషన్స్జడ్జి బుధవారం తీర్పు చెప్పారు. రామకృష్ణకు 20 ఏండ్లు జైలు, రూ.5 వేలు జరిమానా విధించారు.