నాలుగు నెలల మనవడికి తాతయ్య రూ.240 కోట్ల షేర్స్ గిఫ్ట్

నాలుగు నెలల మనవడికి  తాతయ్య రూ.240 కోట్ల షేర్స్ గిఫ్ట్

ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి తన మనవడిపై ప్రేమ కురిపించాడు. నాలుగు నెలల వయసున్న కొడుకు కొడుకు ఏకగ్రహ్ రోహన్ మూర్తికి రూ.240 కోట్ల విలువైన లక్షా 50వేల మార్కెట్ షేర్లు బహుమతిగా ఇచ్చాడు. ఇది ఆ కంపెనీలో 0.04 శాతం వాటాగా ఉంది. శుక్రవారం మార్కెట్ లోని లాభాలని ఆయన కొడుకు కుమారుడి పేరున రాసిచ్చారు. 

మూర్తి కూతురు అక్షతా మూర్తి, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ లకు ఇద్దరు కుమార్తెలు. నారాయణ మూర్తి కొడుకు రోహాన్ మూర్తి, అపర్ణ కృష్ణన్ లు నాలుగు నెలల క్రితం  మగ పిల్లాడు జన్మించారు. అతనే ఏకగ్రహ్ రోహన్ మూర్తి పుట్టకతోనే కోటీశ్వరుడు. ఇప్పుడు మూర్తి షేర్లు 0.40 శాతం నుంచి 0.36 శాతానికి పడిపోయాయి. ఇన్ఫోసిస్‌లో మూర్తి హోల్డింగ్ ప్రస్తుతం రూ.5,586.66 కోట్లుగా ఉంది.