నిజాయితీగా పనిచేసే వారికే ప్రజలు ఓట్లేస్తారు

నిజాయితీగా పనిచేసే వారికే ప్రజలు ఓట్లేస్తారు

బిహార్ అసెంబ్లీతో పాటు.. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో విజయంతో ఢిల్లీలో భారీ విజయోత్సవ సభ నిర్వహించింది బీజేపీ. ఈ సభలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. దేశం కోసం నిజాయితీగా పనిచేసే వారికే ప్రజలు ఓట్లేస్తారని మరోసారి స్పష్టమైందన్నారు. సుపరిపాలనతోనే ప్రజలు బీజేపీకి మద్దతిస్తున్నారన్నారు. గతంలో ఎన్నికలు జరిగితే.. పోలింగ్ కేంద్రాల లూటీకి సంబంధించి వార్తలొచ్చేవన్నారు. కానీ ఇప్పుడు పెరిగిన ఓటింగ్ శాతానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయని చెప్పారు. ఇక.. తమకు భారీ మెజార్టీ ఇచ్చిన బిహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ నేషనల్ చీఫ్ జగత్ ప్రకాశ్ నడ్డా. కరోనా టైంలోనూ ప్రజలు ఇంత భారీ స్థాయిలో ఓటేసేందుకు రావడం సంతోషకరమన్నారు.