ఇవాళ (జనవరి 10) నుంచి ప్రధాని గుజరాత్ టూర్

ఇవాళ (జనవరి 10) నుంచి ప్రధాని గుజరాత్ టూర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10 నుంచి 12 వరకు గుజరాత్ లో పర్యటించనున్నారు. శనివారం సోమనాథ్ కు ఆయన చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు సోమనాథ్  ఆలయంలో నిర్వహించే ఓంకారం మంత్రజపం కార్యక్రమానికి ఆయన హాజరవుతారు.

ఆదివారం ఉదయం 10.15 గంటలకు ఆలయంలో నిర్వహించే వివిధ పూజలతో పాటు సోమనాథ్  స్వాభిమాన్  పర్వ్  శౌర్యయాత్రలోనూ ప్రధాని పాల్గొంటారు. ఈ సందర్భంగా 108 గుర్రాలను ఊరేగిస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మోదీ రాజ్ కోట్​కు బయల్దేరతారు.

అక్కడ నిర్వహించే వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్​కు హాజరవుతారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్​లో ట్రేడ్ షో, ఎగ్జిబిషన్​ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం రాజ్​కోట్ నుంచి అహ్మదాబాద్​కు బయల్దేరతారు.

అదేరోజు సాయంత్రం మహాత్మా మందిర్  మెట్రో స్టేషన్​లో అహ్మదాబాద్  మెట్రో రెండో దశను ప్రారంభిస్తారు. 12న జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్ రిక్ మెర్జ్​తో మోదీ భేటీ అవుతారు.