హైదరాబాద్, వెలుగు: నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ పంచాయితీ ప్రగతి భవన్కు చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్రెడ్డికి బదులుగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిని ఈ స్థానం నుంచి అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ విషయం ఇప్పటికే ఆమెకు చెప్పి సెగ్మెంట్లో పని చేసుకోవాల ని సూచించారు. దీంతో మదన్రెడ్డి వర్గీ యులు ఆమెకు సహకరించడం లేదు. ఇండిపెండెంట్గా పోటీ చేయాలని మదన్రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు.
టికెట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, పోటీ చేసి తీరుతానని మదన్రెడ్డి బహిరంగంగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మదన్రెడ్డిని సీఎం కేసీఆర్ప్రగతి భవన్కు పిలిపించారు. అప్పటికే సునీతా లక్ష్మారెడ్డి అక్కడే ఉండటంతో మంత్రి హరీశ్రావు సమక్షంలో వారితో కేసీఆర్ మాట్లాడారు. సునీతా లక్ష్మారెడ్డి గెలుపు కోసం పని చేయాలని, తగిన ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.