చంద్రయాన్ 3 సక్సెస్ తో చరిత్రలో భారత్ కొత్త అధ్యాయనం లిఖించింది. చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండ్ అయిన ఫస్ట్ దేశంగా చరిత్రకెక్కింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇస్రో సైంటిస్టుల ప్రతిభను కొనియాడుతున్నారు.
చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ చేయడంతో US నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం ఇస్రో( ISRO) చారిత్రాత్మక విజయానికి అభినందనలు తెలిపింది.
చంద్రయాన్-3 చంద్ర సౌత్ పోల్ ల్యాండింగ్ అయ్యినందుకు NASA అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ అభినందనలు తెలిపారు. అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన 4వ దేశంగా భారతదేశానికి అభినందనలు. ఈ మిషన్లో భారత్ కూడా భాగస్వామి అయినందుకు తాము సంతోషిస్తున్నామని ట్వీట్ చేశారు.
Congratulations @isro on your successful Chandrayaan-3 lunar South Pole landing! And congratulations to #India on being the 4th country to successfully soft-land a spacecraft on the Moon. We’re glad to be your partner on this mission! https://t.co/UJArS7gsTv
— Bill Nelson (@SenBillNelson) August 23, 2023