అమెరికాలో నాట్కో జెనరిక్ డ్రగ్

అమెరికాలో నాట్కో జెనరిక్ డ్రగ్

న్యూఢిల్లీ: ఊపిరితిత్తుల్లో అధిక రక్తపోటుకు చికిత్స అందించే జెనరిక్​ డ్రగ్ను అమెరికాలో 180 రోజుల ఎక్స్‌‌‌‌‌‌‌‌క్లూజివిటీతో ప్రారంభించినట్లు హైదరాబాద్​కు చెందిన నాట్కో ఫార్మా బుధవారం తెలిపింది. కంపెనీ ట్రాక్లియర్ ట్యాబ్లెట్ల జెనరిక్​ వెర్షన్​ అయిన బోసెంటన్ ట్యాబ్లెట్స్​ను ప్రారంభించింది.  దీనికి 180 రోజుల జెనరిక్​ డ్రగ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌క్లూజివిటీ లభిస్తుంది. ఈ సమయంలో వేరే ఏ కంపెనీ కూడా అదే ఫార్ములాతో డ్రగ్​ను తయారు చేయదు. మూడేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌‌‌‌‌‌‌‌టెన్షన్​కు బోసెంటన్​ను వాడుతారు.