
నిజామాబాద్, వెలుగు: రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలతో జాతీయ అవార్డుకు ఎంపికైన తోట రాజశేఖర్ను కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సోమవారం శాలువాతో సన్మానించి పూలబొకే అందించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, రెడ్క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ బుస్స ఆంజనేయులు, టీఎన్జీవోల సంఘం జిల్లా ప్రెసిడెంట్ సుమన్, జనరల్ సెక్రటరీ శేఖర్ ఉన్నారు.
ఏడాదికి మూడు సార్లు
తోట రాజశేఖర్ ఇప్పటి వరకు 84 సార్లు రక్తదానం చేశారు. బోధన్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 1990లో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో 18 ఏండ్ల వయస్సులో రక్తదానం చేశారు. తర్వాత ఏడాదికి నాలుగుసార్లు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. సెంట్రల్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా నుంచి 11న ఢిల్లీలో అందుకోవాల్సిన అవార్డు సిందూర్ ఆపరేషన్ వల్ల క్యాన్సల్ అయింది. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ వాస్తవ్యుడైన తోట రాజశేఖర్ నిజామాబాద్ ఎన్పీడీసీఎల్లో ఏడీఈగా పనిచేస్తున్నారు.
కలెక్టర్కు ఆహ్వాన పత్రిక అందజేత
నందిపేట, వెలుగు : నందిపేట మండల కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ఈనెల14,15,16 వ తేదీలలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొనాలని సోమవారం ఆలయకమిటీ సభ్యులు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుకు ఆహ్వాన పత్రిక అందజేశారు.