Rashmika Mandanna: కోరికలు ఎక్కువైతే అది మరిచిపోతాం.. రష్మిక ఇన్స్టా పోస్ట్ వైరల్

Rashmika Mandanna: కోరికలు ఎక్కువైతే అది మరిచిపోతాం.. రష్మిక ఇన్స్టా పోస్ట్ వైరల్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నారు ఆమె. ఇటీవలే బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ.. త్వరలోనే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మూవీ పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓపక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న రష్మిక.. ఇటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. తన ప్రెఫెష్నల్, పర్సనల్ విషయాలను తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. 

ఈక్రమంలోనే తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో ఆమె జీవితం గురించి వివరించారు.. ప్రతీ ఒక్కరు ప్రతి రోజు ఇదే మా చివరి రోజు అని జీవించాలి. నేను చెప్తుంది మీకు బోరింగ్ అనిపిస్తుంది కానీ.. రోజువారి ఆలోచనల్లో పడిపోయి జీవితం గురించి ఆలోచించడం మర్చిపోతున్నాం. సంపాదన, ఖర్చు, సమాజంలో గౌరవం వీటన్నిటి గురించి ఆలోచించి ముఖ్యమైనది చేయడం మరచిపోతున్నాం. అందుకే నేను ఈ క్షణంలో జీవిస్తున్నాను. మనిషి ఆలోచనల్లో, కోరికల్లో మార్పు రాదు. అవి ఎప్పటికి ఆగవు కదా.. అందుకే.. అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా.. ఆ క్షణంలో జీవించడం నేర్చుకోవాలి అంటూ రాసుకొచ్చారు రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక రష్మిక మందన్నా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జున కాంబోలో వస్తున్న కుబేర సినిమాలో కూడా చేస్తున్నారు రష్మిక. ఇక రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇవే కాకుండా.. మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు రష్మిక.