11లక్షల మందికి ఉపాధి కల్పించే నిమ్జ్ ప్రాజెక్ట్ ఆగిందా..?

11లక్షల మందికి ఉపాధి కల్పించే నిమ్జ్ ప్రాజెక్ట్ ఆగిందా..?

సంగారెడ్డి, వెలుగు:  రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అతిపెద్ద ప్రాజెక్టుగా భావించిన ‘జాతీయ పారిశ్రామిక ఉత్పాదక మండలి (నిమ్జ్)’పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా పది లక్షల మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటన్నది తేలకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం, నాలుగేండ్లుగా భూసేకరణ సర్వే కూడా నిలిచిపోవడంతో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిమ్జ్​ విషయంగా టీఆర్ఎస్​ సర్కారు విధానం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఏర్పాటు కావాల్సిన ఈ నిమ్జ్​ను హైదరాబాద్​ శివార్లకు తరలిస్తారన్న ప్రచారంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే ఉద్యమానికి దిగుతామంటూ స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

2009లో మంజూరైనా..

2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో నిమ్జ్​ ఏర్పాటుకు అనుమతిచ్చింది. తర్వాత వచ్చిన ఎన్డీఏ సర్కారు జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఝరాసంగం, న్యాల్​కల్ మండలాల్లోని 18 గ్రామాల పరిధిలో 165వ జాతీయ రహదారిని ఆనుకొని భూసేకరణకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఈ ప్రాజెక్టుకు భూసేకరణ, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మొత్తంగా 12,635 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో కొంత హడావుడి కనిపించింది. కానీ తర్వాత పనులు దాదాపుగా ఆగిపోయాయి. ఇప్పటివరకు మొత్తంగా సేకరించినది 2,892 ఎకరాలే కాగా.. రాష్ట్ర సర్కారు నాలుగేండ్ల కింద భూసేకరణ సర్వే పనులను కూడా నిలిపివేసింది.

మొదట్లో వేగంగా కొనసాగినా..

2015 డిసెంబర్​లో నిమ్జ్​ భూసేకరణకు గ్రీన్​సిగ్నల్​ వచ్చింది. మొదట్లో పనులు జోరుగా సాగాయి. భూసేకరణ కోసం ఇద్దరు డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో రెండు టీమ్​లను రంగంలోకి దించారు. న్యాల్​కల్​ మండలంలోని 14 గ్రామాలు, ఝరాసంగం మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో భూములు సేకరించేందుకు సర్వే నిర్వహించారు.

12,635 ఎకరాల భూమి అవసరం ఉండగా.. 2,892 ఎకరాల భూమిని సేకరించగలిగారు. ఇందుకోసం మొదటి విడత రూ.166 కోట్లను కేటాయించి రూ.152 కోట్లు ఖర్చు చేశారు. సేకరించిన భూముల్లో 1,310 ఎకరాలు పట్టా భూములు, 1,444 ఎకరాలు అసైన్డ్​ భూములుకాగా 137 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి.

20శాతం పనులే అయినయి!

నిమ్జ్​కు భూములు సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. 2015 నుంచి ఏడేళ్లలోపు అంటే 2022 నాటికి ప్రాజెక్టు మొత్తంగా పూర్తికావాలి. కానీ గత ఐదేండ్లలో కేవలం 20 శాతం పనులే.. అవి కూడా కేవలం భూసేకరణకే పరిమితమయ్యాయి. ఇంకా మూడేండ్లలోనే మరో పది వేల ఎకరాల మేర భూసేకరణ, ఇతర ఏర్పాట్లు పూర్తికావాల్సి ఉంది. ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెడితే తప్ప అది సాధ్యమయ్యే పరిస్థితి లేదని అధికార వర్గాలే చెప్తున్నాయి. ఇక పరిహారం తక్కువగా ఇస్తున్నారంటూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు వారి తరఫున తీర్పు ఇచ్చింది. స్థానిక డిమాండ్​ మేరకు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కానీ సర్కారు నుంచి స్పందన లేదు.

పరిహారం కోసం హైకోర్టుకు వెళ్లడంతో..

నిమ్జ్​ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్నవారు తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఎకరాకు రూ. మూడున్నర లక్షల చొప్పున పరిహారం అందజేయగా.. ఎకరాకు 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. చివరికి కోర్టు ఎకరాకు రూ.7.5 లక్షల చొప్పున చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసు నడుస్తుండగానే టీఆర్ఎస్​ సర్కారు భూసేకరణ పనులను పూర్తిగా నిలిపివేసింది. అంతేకాదు ఇన్నేళ్లుగా రాష్ట్ర సర్కారు నిమ్జ్​ విషయంగా కేంద్రానికి ఎలాంటి విజ్ఞప్తులూ చేయలేదు. నిధులు ఇవ్వాలని అడగకపోవడం, రాష్ట్ర ఎంపీలెవరూ పార్లమెంట్​లో నిమ్జ్​ ఏర్పాటును ప్రస్తావించకపోవడంతో అసలు రాష్ట్ర సర్కారుకు నిమ్జ్​ను కొనసాగించే ఉద్దేశం ఉందా, లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 తరలిస్తారనే ప్రచారంతో ఆందోళన

నిమ్జ్​ ప్రాజెక్టును జహీరాబాద్ నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతానికి తరలిస్తున్నారని కొద్దిరోజులుగా ప్రచారం మొదలైంది. భూసేకరణ పనులను పూర్తిగా ఆపేయడం అందుకేనని ఆరోపణలు వస్తున్నాయి. నిమ్జ్​ ఏర్పాటుకు జహీరాబాద్  కన్నా హైదరాబాద్​ శివారు ఎంతో అనువుగా ఉంటుందంటూ రాష్ట్ర సర్కారు కేంద్రానికి సూచించిందని, అందుకు అవసరమైన స్థలాన్ని కూడా పరిశీలించారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. నిమ్జ్​ను తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని స్థానికులు, కాంగ్రెస్, వామపక్షాల నేతలు చెప్తున్నారు.

 ఉద్యమం తప్పదు

జహీరాబాద్​కు కేటాయించిన నిమ్జ్​ ప్రాజెక్టును హైదరాబాద్​కు తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం లేవనెత్తి బాధితుల పక్షాన నిలబడతాం. భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోగా.. సర్వే పనులు కూడా ఇంతకాలం ఆపడం ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం.

నరోత్తమ్, కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు

తొందరగా తేలిస్తే బాగుండు

నిమ్జ్​ ఏర్పాటు చేస్తమని నాకున్న మూడు ఎకరాలు తీసుకున్నరు. అప్పట్లో ఎకరాకు మూడున్నర లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నరు. పరిహారం పెంచి ఇస్తామని చెప్పిన ఆఫీసర్లు ఇప్పటికీ ఇవ్వలేదు. తీసుకున్న భూమిలో సాగు చేసుకుంటున్నా.. కానీ పేరు వాళ్లది పని నాది అన్నట్టుగా ఉన్నది. ఈ వ్యవహారం తొందరగా తేలితే బాగుండేది.

సిద్దన్న, రేజింతల్​ గ్రామం

12,635 ఎకరాల భూమి అవసరం ఉండగా.. 2,892 ఎకరాల భూమిని సేకరించగలిగారు. ఇందుకోసం మొదటి విడత రూ.166 కోట్లను కేటాయించి రూ.152 కోట్లు ఖర్చు చేశారు. సేకరించిన భూముల్లో 1,310 ఎకరాలు పట్టా భూములు, 1,444 ఎకరాలు అసైన్డ్​ భూములుకాగా 137 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి.

20శాతం పనులే అయినయి!

నిమ్జ్​కు భూములు సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. 2015 నుంచి ఏడేళ్లలోపు అంటే 2022 నాటికి ప్రాజెక్టు మొత్తంగా పూర్తి కావాల్సి ఉంది. కానీ గత ఐదేండ్ల కాలంలో కేవలం 20 శాతం పనులే జరిగాయి. అవి కూడా కేవలం భూసేకరణకే పరిమితం అయ్యాయి. ఇంకా మూడేండ్లలోనే మరో పది వేల ఎకరాల మేర భూసేకరణ, ఇతర ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెడితే తప్ప అది సాధ్యమయ్యే పరిస్థితి లేదని అధికార వర్గాలే చెప్తున్నాయి. ఇక పరిహారం తక్కువగా ఇస్తున్నారంటూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు వారి తరఫున తీర్పు ఇచ్చింది. స్థానిక డిమాండ్​ మేరకు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కానీ సర్కారు
నుంచి స్పందన లేదు.

పరిహారం కోసం హైకోర్టుకు వెళ్లడంతో..

నిమ్జ్​ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్నవారు తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఎకరాకు రూ. మూడున్నర లక్షల చొప్పున పరిహారం అందజేయగా.. ఎకరాకు 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. చివరికి కోర్టు ఎకరాకు రూ.7.5 లక్షల చొప్పున చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసు నడుస్తుండగానే టీఆర్ఎస్​ సర్కారు భూసేకరణ పనులను పూర్తిగా నిలిపివేసింది. అంతేకాదు ఇన్నేళ్లుగా రాష్ట్ర సర్కారు నిమ్జ్​ విషయంగా కేంద్రానికి ఎలాంటి విజ్ఞప్తులూ చేయలేదు. నిధులు ఇవ్వాలని అడగకపోవడం, రాష్ట్ర ఎంపీలెవరూ పార్లమెంట్​లో నిమ్జ్​ ఏర్పాటును ప్రస్తావించకపోవడంతో అసలు రాష్ట్ర సర్కారుకు నిమ్జ్​ను కొనసాగించే ఉద్దేశం ఉందా, లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తరలిస్తారనే ప్రచారంతో ఆందోళన

నిమ్జ్​ ప్రాజెక్టును జహీరాబాద్ నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతానికి తరలిస్తున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. భూసేకరణ పనులను పూర్తిగా ఆపేయడం అందుకేనని ఆరోపణలు వస్తున్నాయి. నిమ్జ్​ ఏర్పాటు చేసేందుకు జహీరాబాద్  కన్నా హైదరాబాద్​ శివారు ఎంతో అనువుగా ఉంటుందంటూ రాష్ట్ర సర్కారు.. కేంద్రానికి ఈ మధ్య సూచించిందని, అందుకు అవసరమైన స్థలాన్ని కూడా పరిశీలించారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. నిమ్జ్​ను తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని స్థానికులు, కాంగ్రెస్, వామపక్షాల నేతలు చెప్తున్నారు.

ఉద్యమం తప్పదు

జహీరాబాద్​కు కేటాయించిన నిమ్జ్​ ప్రాజెక్టును హైదరాబాద్​కు తరలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం లేవనెత్తి బాధితుల పక్షాన నిలబడతాం. భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోగా.. సర్వే పనులు కూడా ఇంతకాలం ఆపడం ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం.

– నరోత్తమ్, కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు

తొందరగా తేలిస్తే బాగుండు

నిమ్జ్​ ఏర్పాటు చేస్తమని నాకున్న మూడు ఎకరాలు తీసుకున్నరు. అప్పట్లో ఎకరాకు మూడున్నర లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నరు. పరిహారం పెంచి ఇస్తామని చెప్పిన ఆఫీసర్లు ఇప్పటికీ ఇవ్వలేదు. తీసుకున్న భూమిలో సాగు చేసుకుంటున్నా.. కానీ పేరు వాళ్లది పని నాది అన్నట్టుగా ఉన్నది. ఈ వ్యవహారం తొందరగా తేలితే బాగుండేది.

– సిద్దన్న, రేజింతల్​ గ్రామం