ఇజ్రాయెల్ దాడిలో మరో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మృతి

ఇజ్రాయెల్ దాడిలో మరో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మృతి

టెహ్రాన్: ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహమ్మద్ రెజా సెదీఘీ సాబెర్ చనిపోయాడు. ఇరాన్ మీడియా కూడా రెజా మృతిని ధ్రువీకరించింది. నార్త్ ఇరాన్‌‌‌‌‌‌‌‌లోని ఆస్తనేహ్‌‌‌‌‌‌‌‌ యె అష్రాఫియాలో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్ద రెజా ఉంటున్నాడు. కొన్ని రోజుల కింద రెజా 17 ఏండ్ల కొడుకు కూడా ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ దాడిలోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, జూన్ 13న ఇజ్రాయెల్ జరిపిన ఫస్ట్ ఎటాక్​లో రెజా ప్రాణాలతో బయటపడ్డాడు. 

ఆ తర్వాత నార్త్ ఇరాన్‌‌‌‌‌‌‌‌లోని ఆస్తనేహ్‌‌‌‌‌‌‌‌ యె అష్రాఫియాలో తలదాచుకుంటున్నాడు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. కాగా, సయ్యద్‌‌‌‌‌‌‌‌ మొహమ్మద్‌‌‌‌‌‌‌‌ రెజాను అమెరికా తన ఆంక్షల జాబితాలో చేర్చింది. ఇరాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌కు చెందిన షహిద్‌‌‌‌‌‌‌‌ కరీమి గ్రూప్‌‌‌‌‌‌‌‌నకు సాబెర్ హెడ్​గా ఉన్నాడు. న్యూక్లియర్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లోజివ్స్‌‌‌‌‌‌‌‌ పరికరాల తయారీ ప్రాజెక్టులో కూడా కీలక పాత్ర పోషించాడు.