హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ సిటీని పరిశుభ్రంగా ఉంచడంలో బల్దియా స్వచ్ఛ సర్వేక్షణ్ –2023 అవార్డుకు ఎంపికైంది. ఈనెల 11న న్యూఢిల్లీలో కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవార్డును అందించనుండగా.. జీహెచ్ఎంసీకి ఇన్విటేషన్ పంపించింది.
గత డిసెంబర్ 23 నుంచి పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం సేకరించి అవార్డుకు ఎంపికచేశారు. జీహెచ్ఎంసీ వివిధ విభాగాల్లో అవార్డులను ప్రతి ఏటా అందుకుంటుంది. జాతీయ స్థాయిలో బల్దియాకు అవార్డు రావడం మరింత బాధ్యత పెరిగిందని, ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రాస్ ధన్యవాదాలు తెలిపారు.