
హైదరాబాద్, వెలుగు: దేశంలోని వివిధ నదుల అనుసంధాన ప్రాజెక్టులపై చర్చించేందుకు నేషనల్వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) జనరల్ బాడీ మీటింగ్ను నిర్వహించనుంది. ఈ నెల 28న ఢిల్లీలో ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలతో చర్చించిన అంశాల ఆధారంగా జనరల్ బాడీ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే, అంతకన్నా ముందు ఈ నెల 22న హైదరాబాద్ జలసౌధలో ఎన్డబ్ల్యూడీఏ రాష్ట్రాలతో కన్సల్టెంట్ మీటింగ్ను నిర్వహించనుంది. ఆ మీటింగ్లో రాష్ట్రాలు చెప్పిన అభిప్రాయాలను జనరల్ బాడీ మీటింగ్లో ఎజెండాగా పెట్టనున్నారు. కాగా, గోదావరి కావేరి లింకింగ్లో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సర్కారు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.
ఏపీ తలపెట్టిన పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు చెక్ పెట్టాలంటే జీసీ లింక్కు ఓకే చెప్పడమే బెటర్ అని సర్కారు సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కన్సల్టెంట్ మీటింగ్లో స్పష్టం చేసి.. జనరల్ బాడీ మీటింగ్లోనూ లేవనెత్తాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే ఎజెండాను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటిదాకా జీసీ లింక్లో మనం చెబుతున్న అభిప్రాయాలు, అభ్యంతరాలనూ ఎజెండాలో పెట్టనున్నారు. కొన్ని పట్టువిడుపులకు పోయేలా సర్కారు యోచిస్తున్నట్టుగా తెలిసింది.