
ఖైరతాబాద్, వెలుగు: మువ్వ నృత్య రాగ నిగమం 20వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 9న మాదాపూర్ శిల్పాకళా వేదికలో 40 మంది స్టూడెంట్లతో ‘ నవరస రామచరితం’ కూచిపూడి ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డాక్టర్ హిమబిందు కనోజ్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
కూచిపూడి ప్రదర్శనకు చీఫ్ గెస్టులుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డ్రమ్స్ శివమణి, సినీ నటులు మురళీ మోహన్, భాను చందర్, సుమన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరుకానున్నట్లు ఆమె తెలిపారు.