ప్రైవేటు పెట్రోలు, డీజిల్​ చీప్

ప్రైవేటు పెట్రోలు, డీజిల్​ చీప్
  • రూపాయి చొప్పున డిస్కౌంట్​తో అమ్ముతున్న నయారా ఎనర్జీ 

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిల్​ రిటెయిల్​ విక్రయాలు చేస్తున్న ప్రైవేటు కంపెనీలు రేట్లు తగ్గిస్తున్నాయి. రిలయన్స్​ ఇండస్ట్రీస్​– బీపీ పీఎల్​సీల భాగస్వామ్య సంస్థ ఇప్పటికే రేట్లను తగ్గించగా, తాజాగా మరో కంపెనీ నయారా ఎనర్జీ ప్రభుత్వ రంగంలోని ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీల రేటు కంటే రూపాయి తక్కువకే పెట్రోలు, డీజిల్​ను అమ్ముతోంది. గ్లోబల్​గా చమురు రేట్లు తగ్గినప్పటికీ దేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు ఆ బెనిఫిట్​ను కస్టమర్లకు ఇంకా అందించడం లేదు. కానీ, ప్రైవేటు రంగంలోని కంపెనీలు బెనిఫిట్​ను కస్టమర్లకు అందిచడం మొదలు పెట్టాయి. జూన్​ నెల చివరి దాకా తమ అవుట్​లెట్లలో రూపాయి డిస్కౌంట్​ను కస్టమర్లకు అందిస్తున్నట్లు నయారా ఎనర్జీ ప్రకటించింది.

డొమెస్టిక్​ కన్జంప్షన్​ పెంచడంతోపాటు,లోకల్​ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతోనే తక్కువ రేట్లకే అమ్ముతున్నట్లు పేర్కొంది. దేశంలోని 86,925 పెట్రోల్​పంపులలో 7 శాతం పంపులు ఈ కంపెనీ నిర్వహణలో ఉన్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్​ సహా 10 రాష్ట్రాలలో రూపాయి డిస్కౌంట్​తో పెట్రోలు, డీజిల్​లను కంపెనీ సేల్​ చేస్తోంది. రిలయన్స్​– బీపీ జాయింట్​ వెంచర్​ఒక్క డీజిల్​ను మాత్రమే పీఎస్​యూల కంటే తక్కువ రేటుకు అమ్ముతోంది. గ్లోబల్​గా చమురు రేట్లు తగ్గుముఖం పట్టినప్పటికీ, గతంలోని నష్టాలను భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వ రంగంలోని ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు గత 14 నెలలుగా రేట్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు.