
హైదరాబాద్, వెలుగు: గోల్డ్ లోన్లు ఇచ్చే ఎన్బీఎఫ్సీలలో ఒకటైన ఇండెల్ మనీ లిమిటెడ్, రూ.1,000 ముఖ విలువ కలిగిన సెక్యూర్డ్ ఎన్సీడీల 4వ పబ్లిక్ ఇష్యూను ప్రకటించింది. ఇష్యూ జనవరి 30– ఫిబ్రవరి 12 మధ్య ఉంటుంది. ఇందులో రూ.100 కోట్ల మొత్తానికి బేస్ ఇష్యూ సైజు ఉంటుంది. మొత్తం రూ.200 కోట్ల వరకు ఓవర్- సబ్స్క్రిప్షన్ని నిలుపుకునే అవకాశం ఉంది.
ఈ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను అప్పుల చెల్లింపు, అసలు, వడ్డీని తిరిగి చెల్లించడం/ముందస్తు చెల్లింపు కోసం ఉపయోగిస్తారు. ఈ ఎన్సీడీలపై కూపన్రేటు 12.25 శాతం వరకు ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.పది వేలు. కాలపరిమితి 366 రోజుల నుంచి 72 నెలల వరకు ఉంటుంది.