ఇండెల్ మనీ నుంచి ఎన్​సీడీ ఇష్యూ

ఇండెల్ మనీ నుంచి ఎన్​సీడీ ఇష్యూ

హైదరాబాద్, వెలుగు: గోల్డ్ లోన్లు ఇచ్చే ఎన్‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీలలో ఒకటైన ఇండెల్ మనీ లిమిటెడ్, రూ.1,000 ముఖ విలువ కలిగిన సెక్యూర్డ్ ఎన్​సీడీల 4వ పబ్లిక్ ఇష్యూను ప్రకటించింది. ఇష్యూ జనవరి 30– ఫిబ్రవరి 12 మధ్య ఉంటుంది. ఇందులో రూ.100 కోట్ల మొత్తానికి బేస్ ఇష్యూ సైజు ఉంటుంది.  మొత్తం రూ.200 కోట్ల వరకు ఓవర్- సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ని నిలుపుకునే అవకాశం ఉంది.  

ఈ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను అప్పుల చెల్లింపు, అసలు, వడ్డీని తిరిగి చెల్లించడం/ముందస్తు చెల్లింపు కోసం ఉపయోగిస్తారు. ఈ ఎన్​సీడీలపై కూపన్​రేటు 12.25 శాతం వరకు ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.పది వేలు. కాలపరిమితి 366 రోజుల నుంచి 72 నెలల వరకు ఉంటుంది.